ఢిల్లీలో బీజేపీ ఫుల్ మెజార్టీతో విజయం సాధించింది. ఈ క్రమంలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు పర్వేశ్ సాహిబ్ సింగ్, మనోజ్ తివారీ, విజేందర్ గుప్తా, వీరేంద్ర సచ్దేవా పేర్లు వినిపించగా తాజాగా దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ, అమిత్ షా సీఎంగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారో త్వరలోనే తేలనుంది.