సుప్రీంకోర్టు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రూ.75 వెండినాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 40 గ్రాముల బరువుండే నాణెం, 99.9 శాతం వెండితో తయారవుతుంది. ఒకవైపు అశోక స్తూపం, మరోవైపు సుప్రీంకోర్టు చిత్రాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.