స్కూల్‌ బస్సు ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి

55చూసినవారు
స్కూల్‌ బస్సు ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి
తెలంగాణలోని మెదక్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూల్‌ బస్సు ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆగ్రహం చెందిన కుటుంబసభ్యులు స్కూల్‌ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. చిన్నారి మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్