TG: మహబూబ్నగర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో మాణిక్యరావు అనే వ్యక్తి మరణించాడు. అయితే మాణిక్యరావుకు సంబంధించిన కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తలకొరివి పెడతానని తన కొడుకు గొడవ పెట్టుకున్నాడు. దీంతో మాణిక్యరావు చిన్న కూతురుతో బంధువులంతా కలిసి తలకొరివి పెట్టించి, అంత్యక్రియలను పూర్తిచేశారు.