అగ్ని ప్రమాదంలో విద్యార్థులను కాపాడి ప్రాణాలు వదిలిన ఉపాధ్యాయిని

75చూసినవారు
అగ్ని ప్రమాదంలో విద్యార్థులను కాపాడి ప్రాణాలు వదిలిన ఉపాధ్యాయిని
చెన్నైలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మదురైలోని ఓ మహిళా ప్రైవేటు వసతిగృహంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయిని పరిమళ చౌదరి (50) అప్రమత్తమై గదిలో నిద్రపోతున్న విద్యార్థులను లేపి.. దట్టంగా అలుముకున్న పొగలో నుంచి బయటకు పంపించారు. పొగలో చిక్కుకున్న పరిమళ చౌదరి మాత్రం ఊపిరాడక స్పృహ కోల్పోయి మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఉపాధ్యాయిని శరణ్య (22) కూడా ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత పోస్ట్