యూపీలోని ఉన్నావ్ ప్రాంతంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై మిల్క్ ట్యాంకర్ను ఓ డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బీహార్ నుంచి బస్సు ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.