తాను చాలా మంది సీఎంలను చూశానని, ఎవరూ కూడా రేవంత్ రెడ్డి లాంటి దివాళాకోరు మాటలు మాట్లాడలేదని KTR తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు 6 గ్యారెంటీలు కాకుండా 420 హామీలు ఇచ్చి అమలు చేయట్లేదని ఎద్దేవా చేశారు. 'ఢిల్లీకి పోతే దొంగలా చూస్తున్నారని రేవంత్ అంటున్నారు. దొంగను దొంగాలగే చూస్తారు కదా? జూన్, జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారని తెలుస్తుంది. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల్లో ఉండాలి' అని సూచించారు.