రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలు కసరత్తును ప్రారంభించాయి. అభ్యర్థులను కూడా ఒక్కో చోట ప్రకటించారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కరీంనగర్లో మరోసారి ఎంపీగా బరిలోకి నిలవనున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి బోయినిపల్లి వినోద్ కుమార్ నిలవగా, కాంగ్రెస్ బలమైన అభ్యర్ధి కోసం కసరత్తు మొదలుపెట్టింది. దీంతో త్రిముఖపోరు ఖాయం అని తెలుస్తోంది.