జమ్మూకశ్మీర్ ఆర్ఎస్ పురా ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ 7వ బెటాలియన్కు చెందిన జవాన్ దీపక్ భౌతిక కాయం మంగళవారం ఇంఫాల్కు చేరుకుంది. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. మే 10న పాక్ జరిపిన డ్రోన్ దాడిలో దీపక్ అమరుడు అయ్యారు. ఆయన కుటుంబానికి మణిపూర్ ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.