భ‌ర్త మృతి చెందిన 3 గంట‌ల‌కే మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌

73చూసినవారు
భ‌ర్త మృతి చెందిన 3 గంట‌ల‌కే మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌
తెలంగాణలోని గద్వాల జిల్లా తుమ్మలపల్లికి చెందిన శివ(28) మంగళవారం బైక్‌పై వెళ్తుండగా కిందపడటంతో.. ఏపీలోని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన 3 గంట‌ల‌కే కొడుకు జన్మించాడు. మృతుడి భార్య లక్ష్మి గర్భిణీ కావడంతో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే భార్యకు లో-బీపీ ఉండడంతో భర్త మృతి చెందిన విషయాన్ని కుటుంబీకులు ఆమెకు చెప్పలేదని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్