TG: వరంగల్లోని మిల్స్ కాలనీలో జయంత్ అనే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి ప్రియురాలితో జల్సా చేసేందుకు డబ్బు కోసం తన ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. వరంగల్కు చెందిన రామకృష్ణ జూన్ 8న ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లాడు. అదే అదనుగా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న రామకృష్ణ కొడుకు జయంత్, ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 16 తులాల బంగారం ఎత్తుకెళ్లాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు హాస్టల్కు వెళ్లిపోయాడన్నారు.