పుణెలో యువతిపై సామూహిక అత్యాచారం

85చూసినవారు
పుణెలో యువతిపై సామూహిక అత్యాచారం
మహారాష్ట్రలోని పుణెలో యువతిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పుణెకు చెందిన యువతి గురువారం అర్ధరాత్రి తన స్నేహితుడితో బోప్‌దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది. వీరిని గమనించిన ముగ్గురు దుండగులు యువకుడిపై దాడిచేసి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారు అక్కడినుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్