ఉద్యోగం కోసం వచ్చిన యువతిని ఓ ప్రభుత్వ ఉద్యోగి వేధించిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. గోండా జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో అటెండెంట్గా పనిచేస్తున్న హరివంశ్ (60) ఉద్యోగం కోసం వచ్చిన యువతికి మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు. అసభ్యకరంగా తాకుతూ, ఆమెను లోబరుచుకునేందుకు యత్నించాడు. దీనిని యువతి ఫోన్లో రికార్డు చేసి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు.