పరీక్ష రాయడానికి వెళ్లిన యువతి మిస్సింగ్

57చూసినవారు
పరీక్ష రాయడానికి వెళ్లిన యువతి మిస్సింగ్
TG: హైదరాబాద్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పరీక్ష రాయడానికి వెళ్లిన యువతి అదృశ్యమైంది. సీఐ జగదీష్  వివరాల ప్రకారం... శంషాబాద్‌కు చెందిన ఉగరాల మేఘన(23) ఏవిఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. కాగా శుక్రవారం ఉదయం 6 గంటలకు పరీక్షకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి కళాశాలకు వెళ్ళింది. కాగా సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో ఆమె సోదరుడు కాలేజ్ దగ్గర తనిఖీలు చేశారు. అనంతరం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్