ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును UIDAI మరోసారి పొడిగించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందకు నేటితో గడువు ముగుస్తుండగా.. తాజాగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. 2026 జూన్ 14 వరకు.. అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేసింది. దీనివల్ల లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని ఉడాయ్ తెలిపింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఈ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు.