ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై ఢిల్లీ సీఎం, ఆప్ నేత ఆతిశీ స్పందించారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని ఆతిశీ అన్నారు. శనివారం కల్కాజీ నియోజకవర్గంలో ఆతిశీ రోడ్ షో నిర్వహించారు. తన గెలుపును సెలెబ్రేట్ చేస్తుకున్నారు. ఢిల్లీలో ఓటమి ఆప్కి ఎదురుదెబ్బ అని ఆతిశీ వ్యాఖ్యానించారు. బీజేపీ నిరంకుశత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఆప్ ఎప్పుడూ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటుందని ఆమె తెలిపారు.