గోవా, గుజరాత్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ (AAP) వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నాయకురాలు ఆతిశీ మాట్లాడుతూ.. గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని తెలిపారు. కాంగ్రెస్తో పొత్తు విషయమై ఇప్పటివరకు చర్చలేమీ జరగలేదని స్పష్టం చేశారు. గోవాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ మేరకు ఆమె మాట్లాడారు.