గుజరాత్లోని విసవదర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ BJPకి పెద్ద షాక్ ఇచ్చింది. ఆప్ అభ్యర్థి ఇటాలియా గోపాల్ 17 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. BJP అభ్యర్థి కిరీట్ పటేల్ను ఓడించిన గోపాల్, రాష్ట్ర రాజకీయాల్లో ఆప్ బలాన్ని మరోసారి చాటారు. దీంతో ఆప్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, ఢిల్లీలో ఓడిన ఆప్.. ప్రధాని మోదీ కంచుకోట గుజరాత్లో గెలవడంతో BJPకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.