TG: కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. పుష్కరాల కోసం 3, 4 నెలలుగా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. కాశీలో జరిగినట్లు సరస్వతి పుష్కరాల్లో కూడా ప్రతిరోజూ సాయంత్రం హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎక్కడా లేని విధంగా పుష్కరఘాట్ల సమీపంలో టెంట్ సిటీ నిర్మించామని మంత్రి చెప్పారు.