AP: శ్రీకాకుళం (D), టెక్కలి (M) రంగాపురంలో షాకింగ్ ఘటన జరిగింది. శ్రావణి(23)అనే యువతికి 2022లో వివాహమైంది. పెళ్లి తర్వాత రోహిత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమగా మారింది. ఇక భర్తతో కలిసి జీవించలేననే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వాళ్లు నిరాకరించారు. దీంతో ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అయితే తాజాగా రోహిత్ ఆమెను వదిలేయడంతో శ్రావణి తలకు వేసుకునే రంగు తాగి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.