జమ్మూకశ్మీర్ రాంబన్ సమీపంలో అమర్నాథ్ యాత్రికుల బస్సులు ఘర్షణకు గురై 5 బస్సులు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 36 మంది యాత్రికులు స్వల్ప గాయాలు పాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొదటి రెండు రోజుల్లో 20 వేల మందికి పైగా భక్తులు అమర్నాథ్ యాత్రలో పాల్గొని దర్శనం చేసినట్లు అధికారులు వెల్లడించారు. యాత్రికుల రక్షణకు సంబంధిత అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.