కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

59చూసినవారు
కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం
AP: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి సీతంపేటకు చెందిన 11 మంది కుటుంబ సభ్యులు విజయవాడ కనకదుర్గ దర్శనానికి ఆటోలో బయలుదేరారు. కృష్ణంపాలెం జాతీయ రహదారిపై ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు  గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్