రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోందని నటుడు పృథ్వీరాజ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్, మెసేజ్లతో తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ‘లైలా’ ప్రీరిలీజ్ ఈవెంట్లో పృథ్వీ.. ‘150 మేకల్లో చివరకు 11 మిగిలాయి.’ అని చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దాంతో ఆ సినిమాను బాయ్కాట్ చేయాలని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం ప్రారంభించింది.