హైదరాబాద్ మెట్రో ఒక ప్రత్యేక ప్రయాణికుడిని స్వాగతించిందని హైదరాబాద్ మెట్రో ట్వీట్ చేసింది. మరెవరో కాదు హైదరాబాద్లో ఉన్నప్పుడు నగరానికి ఇష్టమైన రవాణా విధానాన్ని ఎంచుకున్న నటుడు కిచ్చా సుదీప్ అని తెలిపింది. ‘తెరపై బ్లాక్ బస్టర్ ప్రదర్శన నుంచి క్రికెట్ మైదానంలో శక్తివంతమైన నాయకత్వం వరకు, సుదీప్ ఉనికి మెట్రోను వెలిగించింది. తోటి ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత ఉత్తేజపరిచింది’ అంటూ పేర్కొంది.