భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. ఉగ్ర స్థావరాలపైనే దాడి చేస్తున్నట్లు భారత్ ప్రకటించినప్పటికీ.. పాక్ మీడియా మాత్రం మొసలి కన్నీరు కారుస్తోంది. తాజాగా ఓ టీవీ ఛానల్లో పాకిస్థానీ నటి నదియా ఖాన్ ఆ దేశ సోషల్ మీడియా సెలబ్రిటీలపై మండిపడ్డారు. ‘మిమ్మల్నీ స్టార్లను చేసి నెత్తి మీద పెట్టుకున్నాం. ఇప్పుడు దేశానికి మీ అవసరం ఉంది. ఈ సమయంలో ఎక్కడున్నారు. లైక్, ఫాలొయింగ్ కోసమేనా.’ అంటూ ఫైరయ్యారు.