పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని బడిబాట చేపట్టిన టీచర్లకు ఆదిలాబాద్ యపల్గూడలో చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి వారిని ప్రశ్నిస్తూ, మీ పిల్లలు అక్కడ ఎందుకు చదవడం లేదని నిలదీశారు. టీచర్ల సహకారంతోనే పాఠశాలలు మెరుగవుతాయని అన్నారు. బీఈడీ చేసిన మీరు ఏం చేస్తున్నారు? ప్రైవేటులో ఫెయిలైనవారే బోధిస్తున్నారు అంటూ కడిగిపడేశారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.