ఢిల్లీ తీర్పే రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిపీట్ అవుతుందని బిజెపి పట్టణ అధ్యక్షుడు వేదవ్యాస్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి భారీ విజయం సాధించడం పట్ల ఆదిలాబాద్లో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారన్నారు. రానున్న కాలంలో బీజేపి మరిన్ని విజయాలు సాధిస్తుందన్నారు.