భారత సైన్యం, ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు విద్యార్థులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక వినాయక చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. దీంతో పట్టణం త్రివర్ణ శోభ సంతరించుకుంది.