4 సార్లు ఎమ్మెల్యేగా జోగురామన్నకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పటికీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. తనతోపాటు ఎంపీ నగేశ్పై మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి నిర్లక్ష్యం కారణంగా జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు వేరే జిల్లాకు తరలిపోయాయని ఆరోపించారు. హద్దుల్లో ఉండి మాట్లాడాలని హితవు పలికారు.