ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరమని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బంగారిగూడ వెంకటేశ్వర ఆలయంతో పాటు, బోత్ నియోజకవర్గంలోని బరంపూర్ వెంకటేశ్వర ఆలయాలను సందర్శించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.