పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తపస్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పది ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన చిల్కూరి రమ, అనుశ్రీ, హరీష్ లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని అందుకు ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలే నిదర్శనమని జిల్లా ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ అన్నారు.