ఆదిలాబాద్: నిందితులపై రౌడీషీట్లు ఓపెన్

51చూసినవారు
ఆదిలాబాద్: నిందితులపై రౌడీషీట్లు ఓపెన్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 25న జరిగిన హత్య కేసులో నిందితులైన ముగ్గురిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. పట్టణానికి చెందిన కొమ్మవార్ రవితేజ ను గ్రూపు తగాదాల కారణంగా మహాలక్ష్మీవాడకు చెందిన గోల్డెన్ కార్తిక్, ఇంద్రానగర్ కు చెందిన సిద్దూ, దావుల సాయికిరణ్ హత్య చేసిన విషయం తెలిసిందే. గతంలో నిందితులపై పలు కేసులు ఉన్న నేపథ్యంలో రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్