ఆదిలాబాద్ నుండి హజ్ యాత్ర బృందం శుక్రవారం రాత్రి బయలుదేరింది. పట్టణంలోని ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హజ్ సొసైటీ ద్వారా యాత్రికులకు స్థానికులు, కుటుంబసభ్యులు పూలమాలలతో సత్కరించి సాగనంపారు. అంతకు ముందు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రపంచ శాంతి, ఉగ్రవాద నిర్మూలన కోసం అల్లాను ప్రార్థించాలని కోరారు. అలాంటి అవాంతరాలు, ఆవరోధాలు రాకుండా అల్లా దయవల్ల ఈ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.