ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీచాముండేశ్వరి ఆలయంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ద్వారం తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు శనివారం ఆలయానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.