ఆదిలాబాద్: ఆలయంలో చోరీ

72చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాంసీ బస్ స్టాండ్ సమీపంలో గల హనుమాన్ ఆలయంలో చోరీ జరిగింది. శనివారం ఆలయానికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండడంతో నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దేవతామూర్తుల విగ్రహలపై అలంకరించిన వెండి ఆభరణాలు చోరీకి గురయినట్లు గుర్తించారు. దాదాపు 30 నుండి 40 వేల విలువైన వెండి ఆభరణాలు చోరీకి గురయినట్లు ఆలయ నిర్వాహకులు సుమిత్ తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్