ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యం అయ్యింది. సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని మల్కాపూర్కు చెందిన రాథోడ్ రాధా తన కూతుళ్లు రాణి, మనీషాలతో కలిసి ఇటీవల ఆదిలాబాద్లోని బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం ఇద్దరు కూతుళ్లు, మరో ఇద్దరమ్మాయిలు ఇంటి బయటకు వెళ్లగా రాణి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లి రాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.