రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాపించిన 6 గ్యారెంటీలను ప్రజల వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటామని డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు పేర్కొన్నారు. గురువారం ఆసిఫాబాద్ పట్టణంలోని టీఆర్ నగర్, గోడవెల్లిలో లబ్దిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బాలేష్ గౌడ్, అసిఫ్ అలీ, రఫీక్, తదితరులు పాల్గొన్నారు.