జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన విషయం తెలిసింది. ఇందులో భాగంగా ఆదివారం ఘటన స్థలాన్ని అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడారు. పెద్ద వాహనాలను నిలిపివేసి, సాధారణ వాహనాలను లాండసాంగ్వి వైపుకి దారి మళ్లించారు. ఈ కార్యక్రమంలో సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం, తదితరులు ఉన్నారు.