ఆదిలాబాద్ రిమ్స్ లో బైక్ దొంగతనం చేసిన దొంగను టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల మేరకు, రిమ్స్ ఉద్యోగి సల్మాన్ సోమవారం తన బైక్ ను ఆసుపత్రి ఆవరణలో పార్కు చేశాడు. తిరిగి వచ్చి చూసేటప్పటికి వాహనం లేకపోవడంతో టూటౌన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విష్ణుప్రకాష్ తన సిబ్బందితో కలిసి గాలించి బస్టాండ్ సమీపంలో నిందితుడు చెంచు దేవన్నను మంగళవారం అదుపులోకి తీసుకుని బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.