సాంస్కృతిక సారధి కళాకారుల సంబరాలు

67చూసినవారు
తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులకు పిఆర్ సిని అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ కళాకారుల బృందం శుక్రవారం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇది వరకు రూ. 24, 514 గా ఉన్న గౌరవ వేతనాన్ని రూ. 31, 868 కు పెంచారు.

సంబంధిత పోస్ట్