తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ రియాజ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించగా ఆయనను ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లైబ్రరీలను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాలు అభివృద్ధి చెంది పాఠకులకు మరిన్ని మెరుగైన సేవలందిస్తాయన్నారు.