ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడలో బుధవారం రాత్రి నిర్వహించిన దండారి ఉత్సవాలలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, పీఓ కుష్భూగుప్తా పాల్గొన్నారు. కలెక్టర్ ఆదివాసులతో కలిసి దండారి ఆడగా, పీఓ మహిళలతో కలిసి రేలా రేలా పాటలపై ఆడి పాడారు. అంతకుముందు ఆదివాసి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. దండారి ఉత్సవాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఉత్సవాలకు రూ. 15 వేలు అందించారు.