టీపీసీసీ ఆదేశాల మేరకు ఈనెల 6న మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక గార్డెన్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుందని పార్లమెంట్ ఇన్చార్జ్ ఆత్రం సుగుణక్క తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారని పేర్కొన్నారు.