అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 5న ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద జెడ్పి ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భోజారెడ్డి, రాజేష్ లు తెలిపారు. అండర్ 14, 16, 18, 20 వయస్సు విభాగాల్లో బాల బాలికలకు వేరువేరుగా జావెలిన్ త్రో, 100, 400 మీటర్ల పరుగు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.