జైనథ్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. పోలీసు స్టేషన్ను పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు, ఛార్జ్షీట్ ఫైళ్లతో పాటు రికార్డులను పరిశీలించారు. కోర్టు కేసుల పురోగతిని పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ వెంట జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం ఉన్నారు.