సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ ఖమర్ సూచించారు. ఆదిలాబాద్ లోని వార్డ్ నెంబర్ 48, 49 లోని కాలనీలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ దోమలు వృద్ధి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. చుట్టు పక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, మెప్మా, వైద్య సిబ్బంది ఉన్నారు.