కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, దివంగత నేత సి. రామచంద్ర రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం అదిలాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కుటుంబ సభ్యులతోపాటు కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. జిల్లాకు ఆయన చేసిన అభివృద్ధిని స్మరించుకున్నారు. మాజీ టీపీసీసీ కార్యదర్శి సుజాత, ఆత్రం సుగుణ, శ్రీకాంత్ రెడ్డి, తదితరులున్నారు.