కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీలను విస్మరిస్తున్నాయని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. బేల మండలంలో ఉపాధి హామీ కూలీలఫై తేనెటీగలు దాడి చేయగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిని మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఉపాధి హామీల కూలీల సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామన్నారు.