బీ. ఆర్. ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రొకండ్ల రమేష్ గుండెపోటుతో అకాల మరణం చెందగా. ఆదివారం ఆదిలాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించారు. రొకండ్ల రమేష్ పార్థివ దేహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న గులాబీ కండువా కప్పారు. ఉమ్మడి జిల్లా నుండి పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశ్రు నయనాల నడుమ తమ అభిమాన నేతకు వీడ్కోలు పలికారు.