గాదిగూడ, నార్నూర్తో పాటు పలు మండలాల ప్రజలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం(రేపు) జైనూరులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సీఐ రమేష్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ శిబిరంలో బీపీ, షుగర్, గుండె, క్యాన్సర్, ఊపిరితిత్తులతో పాటు వివిధ సమస్యలపై వైద్యం అందించనున్నామన్నారు. దీంతో ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.